మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక తొలిసారి “ఒక మనసు” చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేసింది. మొదటి చిత్రమే ఈ ముద్దుగుమ్మకు నిరాశను మిగిల్చింది. ఈ సినిమాలో నీహారిక నటనపై విమర్శలు వచ్చాయి. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెబ్ సిరీస్ చేసింది. ఆ వెబ్ సిరీస్ కు మంచి గుర్తింపు రావడంతో “హ్యపీ వెడ్డింగ్” అనే చిత్రంలో నటించింది నిహారిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఇటీవల “సూర్యకాంతం” చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాగా… ఈ చిత్రం కూడా నీహారికను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో నిహారిక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నటనకి గుడ్బై చెప్పి నిర్మాతగా మంచి సినిమాలు చేయాలని నిహారిక భావిస్తుందట. ఇప్పటికే తన సొంత బేనర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బేనర్పై నిహారిక పలు వెబ్ సిరీస్లు చేసిన విషయం తెలిసిందే. ఇదే బేనర్పై సినిమాలు కూడా చేయాలని ఈ మెగా హీరోయిన్ అనుకుంటున్నట్టు సమాచారం. తన తొలి సినిమా మెగా హీరోతోనే ఉంటుందని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలుసుకోవాలంటే నిహారిక స్పందించాల్సిందే.
“కార్తీక దీపం” సీరియల్ పై దర్శకుడి వెదవ కామెంట్స్… !?