“సవ్యసాచి”తో తెలుగు తెరపై తెరంగ్రేటం చేసిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు రామ్తో “ఇస్మార్ట్ శంకర్” షూటింగ్తో బిజీగా ఉంది నిధి అగర్వాల్. దాదాపు ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి కావొస్తుంది. ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ పాటను వచ్చే నెలలో యూరప్లో చిత్రీకరించబోతున్నారట. ఇలాంటి సమయంలో నిధి అగర్వాల్ ఎక్కడో తన పాస్పోర్ట్ను పారేసుకుంది. ఇక పాస్ పోర్ట్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి షెడ్యూల్ ప్లాన్ మారుస్తారేమోనని అందరూ భావించారు. అయితే నిధి అగర్వాల్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ కంప్లైంట్ను ఫైల్ చేసి సంబంధిత పాస్ పోర్ట్ అధికారులను కలిసి వారికి తన పరిస్థితిని వివరించిందట. దాంతో వారు ఈ అమ్మడుకి త్వరగానే పాస్ పోర్ట్ను వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు యూరప్ షెడ్యూల్ అనుకున్న ప్లానింగ్ ప్రకారమే జరగనుందని తెలుస్తోంది.