రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు అనేదానిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా స్పష్టత లేదంటే అతిశయోక్తి కాదు. నిన్నమొన్నటి వరకు రాహుల్ గాంధీయే పార్టీలో ప్రధాన ఆకర్షణ. దీనితో ఆయనే అనుకునే వారు. ఇటీవలే ప్రియాంక రాజకీయ అరంగేట్రం చేశారు. దీనితో అన్నాచెల్లెళ్లలో ఎవరిదా పదవి? అన్న చర్చ మొదలయింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్న రాహుల్ గాంధీయే ప్రధాని అవుతారని ప్రియాంకవాద్రా స్పష్టం చేసి సందేహాలకు తెరదించారు. గాంధీ కుటుంబం నుంచి ఇటువంటి ప్రకటన వెలువడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ప్రస్తుతం అన్న సొంత నియోజకవర్గమైన అమెథీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంకవాద్రా, ఎన్నికలలో గెలిస్తే రాహుల్గాంధీ ప్రధాని అవుతారని విస్పష్ట ప్రకటన చేశారు. విపక్ష కూటమిలోని పలు పార్టీల నేతలు రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొన్నప్పటికీ ఆయన మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ఈ విషయంపై నోరు మెదపలేదు.
జర్నలిజం మౌలిక స్వరూపం దెబ్బతింది: ఉప రాష్ట్రపతి వెంకయ్య