న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. సెప్టెంబర్ 1 నుంచి శ్రీలంకతో పల్లెకెల వేదికగా ప్రారంభంకానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడు దూరంకానున్నాడు. కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న విలియమ్సన్కు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. కేన్తో పాటు సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్కు విశ్రాంతినిచ్చారు. కేన్ స్థానంలో సీనియర్ ఆటగాడు టిమ్ సౌథీకి తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
వరల్డ్కప్ టోర్నీలో సౌథీ కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడు. లంకతో జరిగిన తొలి టెస్టులోనూ సౌథీ తుది జట్టులో ఉన్నాడు. తొలి టెస్టులో కివీస్ పరాజయం కాగా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో కివీస్ 0-1తో వెనుకంజలో ఉంది. ప్రపంచకప్ టోర్నీలో కేన్, ట్రెంట్ అద్భుతమైన పాత్ర పోషించారు. త్వరలో కివీస్ కీలక సిరీస్లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి విశ్రాంతినివ్వడం ఇదే మంచి సమయమని భావించినట్లు సెలక్టర్ గవిన్ లార్సెన్ తెలిపారు.