న్యూజీలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై దుండగులు జరిపిన కాల్పుల్లో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. పక్కా ప్రణాళికతోనే ఈ కాల్పులకు తెగబడ్డారని న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు.
అతివాద భావజాలం కలిగిన టెర్రరిస్టు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. దాడి చేసిన వ్యక్తి ఆస్ట్రేలియాలో జన్మించిన వ్యక్తి అని తెలిపారు. ఘటనపై న్యూజీలాండ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని… ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇంతకు మించి స్పందించలేనని చెప్పారు.