telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

న్యూజిలాండ్ కాల్పులలో 40 మంది మృతి; ఆస్ట్రేలియా అతివాది పనే.. !

newzeland firing costs 40 culprit from australia

న్యూజీలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో రెండు మసీదులపై దుండగులు జరిపిన కాల్పుల్లో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. పక్కా ప్రణాళికతోనే ఈ కాల్పులకు తెగబడ్డారని న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు.

అతివాద భావజాలం కలిగిన టెర్రరిస్టు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. దాడి చేసిన వ్యక్తి ఆస్ట్రేలియాలో జన్మించిన వ్యక్తి అని తెలిపారు. ఘటనపై న్యూజీలాండ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని… ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇంతకు మించి స్పందించలేనని చెప్పారు.

Related posts