telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

న్యూఢిల్లీ : … త్వరలో … బీజేపీకి కొత్త సారథి..

bjp party

ఫిబ్రవరిలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిహార్‌, రాజస్థాన్‌, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలకు పార్టీ కొత్త చీఫ్‌లను కూడా నియమించేందుకు అవకాశాలున్నాయి. సంక్రాంతి తర్వాత కసరత్తు ప్రారంభించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. కొన్ని నెలలుగా జరుగుతున్న సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ మేరకు మార్పులు కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఒక వ్యక్తి-ఒక పదవి సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవిని జేపీ నడ్డా చేపట్టేందుకు అమిత్‌ షా మొగ్గు చూపేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం నడ్డా బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. నరేంద్ర మోదీ కేబినెట్‌లో అమిత్‌ షా హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

Related posts