telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

తస్మాత్ జాగ్రత్త.. కరోనాలో మళ్ళీ కొత్త లక్షణాలు!

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. కరోనా ఎలాంటి  లక్షణాలు లేకున్నా సోకుతుంది. మొదట్లో జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉండేవి. అయితే తాజాగా కరోనా కొత్త లక్షణాలు ఇవే కరోనా వైరస్ తాజా లక్షణాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ( NIH ) వెల్లడించింది . నాలుక రుచి జ్ఞానం కోల్పోవడంతో పాటు నోట్లో పొక్కులు , నోరు పొడిబారటం ( డ్రై మౌత్ ) వంటి సమస్యలు వస్తున్నట్లు తేలింది . నోట్లో లాలాజలం ఊరకపోవడం వల్ల డ్రై మౌత్ సమస్య వస్తుందని తెలిపింది . అలాగే ఆహారం తీసుకున్నా , నీళ్లు తాగినా నాలుక మండుతుందని పేర్కొంది . నాలుక తడారిపోవడంతో పాటు నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడుతాయని చెప్పింది.

Related posts