నేడు బి.రాజ కుమారి ఐ. పి.ఎస్. విజయనగరం జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు జిల్లా పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజలు సౌమ్యులు, శాంతి కాముకులు..తను శాంతి భద్రతలని కాపాడడంలో ప్రాధాన్యత ఇస్తాను అని, మహిళలు, పిల్లలకి నేరాలు పట్ల అవగాహన కల్పిస్తాం అని తెలిపారు. అలాగే బాధితులకు న్యాయం జరిగేలా చొరవ తీసుకొని ఎలాంటి వారు అయిన తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
జిల్లా లో ఇసుక , మద్యం నియంత్రణ వంటివి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతాం అని తెలిపారు. అలాగే గతంలో తన కంటే ముందు ఉన్న అధికారులు ఏయే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ తను కూడా కొనసాగిస్తాను అని పేర్కొన్నారు. ప్రజలకి దగ్గరగా ఉంటూ సేవలు అందిస్తానని, ప్రజలు కూడా తనకి సహకరిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.
తన మంత్రి పదవి ఎవరి బిక్ష కాదు..ఈటల సంచలన వ్యాఖ్యలు!