ఇప్పటి వరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ పాలన సౌలభ్యం కోసం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో కోరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాలతో కొల్లాపూర్ డివిజన్ను ఏర్పాటు చేయనున్నారు. జగిత్యాల జిల్లాలో కొత్తగా కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఈ డివిజన్లో కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలను చేర్చానున్నారు.
కాంగ్రెస్ ఓడిపోవడానికి పార్టీ నేతలే కారణం: బీహార్ పీసీసీ