telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

వివేకా హత్య కేసు : .. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు..

/Letter hand writing viveka daughter sunitha

వివేకా హత్యకేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం అనంతపురం, చిత్తూరు, తిరుపతికి చెందిన పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఈ బృందం దర్యాప్తును ముమ్మరం చేయనుంది. కొత్త బృందం బుధవారం వైఎస్ వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించింది. అనంతపురం జిల్లా పెనుగొండ డీఎస్పీ రామకృష్ణ, పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌, సీఐలు శ్రీరాం‌, అమిత్‌ఖాన్‌, రామాంజినాయక్‌, పలువురు ఎస్‌ఐలు పులివెందులలోని వివేకానందరెడ్డి ఇంటికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వాచ్‌మన్‌ రంగయ్యను విచారించారు.

అప్పట్లో వివేకా హత్యకేసు పెను సంచలనమైంది. ఈ హత్యకేసుపై వెంటనే స్పందించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే, ఎన్నికల నేపథ్యంలో దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

Related posts