telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ .. సరికొత్తగా .. సిద్ధమవుతోంది..

new feature in ipl 2020

ఐపీఎల్ అతిత్వరగా వీక్షకులను ఆకట్టుకుంది. దీనితో దానికి ప్రాచుర్యం ఎక్కువైపోయింది. ప్రతి సీజన్ లో సరికొత్తగా ముస్తాబవుతునే ఉంది. ధనాధన్ క్రికెట్‌గా.. ఒక పక్క సిక్స్‌లు జోరు.. మరో పక్క వికెట్ల హోరుతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది ఈ మినీ క్రికెట్. ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్ ఖచ్చితంగా హౌస్‌ఫుల్ కావాల్సిందే. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ లీగ్ ద్వారా ఎందరో మేటి క్రికెటర్లు సీనియర్ల సారధ్యంలో వెలుగులోకి రావడం గొప్ప విశేషం. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో బీసీసీఐ సరికొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది. అదే ‘పవర్ ప్లేయర్’ నిబంధన. ఆటగాళ్ల సబ్సిట్యూషన్ కోసం ఈ రూల్‌ను ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కమిటీ ఈ మేరకు తీర్మానం చేయగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

పవర్ ప్లేయర్ రూల్ అంటే ఏంటంటే .. వికెట్ పడిన అనంతరం తుది జట్టులోకి ఏ ఆటగాడైనా బ్యాటింగ్‌కు దిగొచ్చు.. అలాగే ఏ తరుణంలోనైనా బౌలర్ ఫీల్డ్‌లోకి వచ్చి బౌలింగ్ చేయొచ్చు. ఇక వీరిని ఎప్పుడు దించాలన్నది తుది నిర్ణయం జట్ల కెప్టెన్లకే వదిలేశారు. దీనికి ఉదాహరణ ఏంటంటే.. ఒక మ్యాచ్‌లో జట్టుకి చివరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సి ఉంది. ఆ సమయంలో టైయిలండర్లు క్రీజులో ఉన్నారు. ఈ పవర్ ప్లేయర్ నిబంధన ప్రకారం.. డాషింగ్ బ్యాట్స్‌మెన్ రస్సెల్ లాంటి వారిని దింపి.. భారీ షాట్స్‌తో జట్టును గెలిపించవచ్చు. అలాగే బెంచ్‌కు పరిమితమైన బుమ్రా లేదా రబడా లాంటి బౌలర్లను.. చివరి ఓవర్లలో వికెట్లు పొందటానికి రంగంలోకి దింపొచ్చు. ఈ రూల్ ఒకవేళ ఐపీఎల్‌లో వస్తే.. గేమ్ స్వభావమే వేరే రకంగా ఉంటుంది. అటు మొదట ఈ ప్రయోగాన్ని దేశవాళీ టీ20 టోర్నీలో అమలు చేసి.. ఆ తర్వాత ఐపీఎల్‌లో అమలు చేయనున్నారని తెలుస్తోంది.

Related posts