ద్విచక్ర వాహనాలు అంటే మక్కువ ఉన్నవారికి ఉత్సాహపరిచే వార్త. టీవీఎస్ తాజాగా అపాచీ ఆర్టీఆర్ 160 4వీ పేరిట ఏబీఎస్ వేరియంట్లో సరికొత్త బైక్ ను భారత మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.98,644గా నిర్ణయించింది. ప్రస్తుతం ఫ్యూయెల్ ఇన్జెక్టెడ్ ఏబీఎస్ వేరియంట్ను అందుబాటులోకి రాగా, కార్బురేటర్ వేరియంట్ను మరికొన్ని వారాల్లో మార్కెట్లోకి తీసుకరాబోతున్నట్లు తెలిపారు.
ఇక ఈ బైక్ ఫీచర్లు :
* అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోడల్లో 159 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది.
* ఫ్యూయెల్ ఇన్జెక్షన్, కార్బురేటర్ ఆప్షన్లలో లభ్యమౌతోంది.
* ఈ బైక్ లో ఐదు గేర్లు ఉంటాయి.