లెజండరీ కమెడియన్ ఎంఎస్ నారాయణ ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 2015 జనవరిలో అనారోగ్య సమస్యలతో ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. ఎంఎస్ నారాయణ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు నారాయణను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ శ్రేయాస్ మీడియా తమ సోషల్ మీడియా పేజ్లో ఎంఎస్ నారాయణకు నివాళులు అర్పించింది. ఆ ఫొటోను చూసిన ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తన ఫేస్బుక్లో అదే ఫొటోను షేర్ చేశాడు. అయితే ఫొటోలో ఎంఎస్ నారాయణ వర్ధంతి అని రాసుంటే.. హైపర్ ఆది ‘హ్యాపీ బర్త్డే సర్’ అని పెట్టాడు. ఆ పోస్ట్ పెట్టిన దాదాపు రెండు గంటల తర్వాత జరిగిన తప్పును చూసుకున్న ఆది ఆ పోస్ట్ డిలీట్ చేసి మళ్లీ అదే ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఎంఎస్ నారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటున్నాం’ అని పెట్టాడు. కానీ అప్పటికే దాదాపు 600లకు పైగా లైక్స్, కామెంట్స్ వచ్చేశాయి. ఫొటో స్క్రీన్ షాట్స్ కూడా వెళ్లిపోయాయి. ఇంకేముంది నెటిజన్స్ ఆదిని ఏకిపారేశారు.
previous post
next post
మహేశ్ బాబు అందం గురించి సుమ ప్రశంసలు