telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి.. సోషల్ మీడియాలో శ్రీదేవి అభిమానుల రచ్చ

Sridevi

ఇటీవ‌ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న మ‌ర‌ణంపై బాలీవుడ్‌లో పెను దుమార‌మే రేగుతోంది. సుశాంత్ కేసును కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐకి అప్ప‌గించింది. అలాంట‌ప్పుడు అనుమానాస్పదంగా దుబాయ్‌లో చ‌నిపోయిన శ్రీదేవి మ‌ర‌ణంపై ఎందుకు సీబీఐ విచార‌ణ చేయ‌లేదని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె అభిమానులు ఉద్య‌మం చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి 2018 ఫిబ్ర‌వ‌రి 24న దుబాయ్‌లో త‌న ఉన్న హోట‌ల్ రూం బాత్ ట‌బ్‌లో ప‌డి చ‌నిపోయారు. శ్రీదేవి మృతిపై ఆమె అభిమానులు చాలా మంది ఇంకా అనుమానాలను వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. ఆగ‌స్ట్ 13న శ్రీదేవి జయంతి. ఈ సంద‌ర్భంగా శ్రీదేవి అభిమానులు నెట్టింట ‘సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు రెండున్న‌రేళ్ల త‌ర్వాత శ్రీదేవి అభిమానులు ఇలా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు.

Related posts