telugu navyamedia
సినిమా వార్తలు

ఇలాంటి సమయంలో ఆ ఫొటోలా… రజినీ కూతురిపై నెటిజన్స్ ఫైర్

Soundarya-Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ ఇటీవలే విశాగన్ ను రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2016లో తన మాజీ భర్తకు విడాకులిచ్చింది సౌందర్య. సౌందర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పెళ్లి ఫోటోలకు అభిమానుల నుంచి భారీగా లైకులు, షేర్లు లభించాయి. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తన భర్తతో హనీమూన్ కి వెళ్లిన సౌందర్య హ్యాపీగా ఉందంటూ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లు ఇప్పుడు సమయం ఏంటి ? నువ్వు పోస్ట్ చేస్తున్న ఫోటోలు ఏంటి ? అంటూ మండిపడుతున్నారు. ఓవైపు కాశ్మీర్ పుల్వామా జవానులపై జరిగిన దాడికి భారత్ మొత్తం ఆగ్రహంగా ఉంటే… నువ్వేమో ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తున్నవ్… అంటే నిన్ను ఎలా పొగడాలో అర్థం కాట్లేదు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మరికొందరేమో మనం కోల్పోయింది సినిమాల్లోని నకిలీ హీరోలను కాదు… దేశం కోసం పోరాడే రియల్ హీరోలను అంటూ ఫైర్ అవుతున్నారు.

Related posts