telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో భారీ చోరీ..నేపాలి గ్యాంగ్ అరెస్ట్

రాయదుర్గం నేపాలి గ్యాంగ్ అరెస్ట్ ఇవాళ అరెస్ట్ అయింది. రాష్ట్రాలు దాటి నేపాల్ పారిపోతున్న క్రమంలో యూపీ బార్డర్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈనెల ఆరో తారీఖున రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిఎంఆర్ హిల్స్ లో యజమానులకు మత్తుమందు ఇచ్చి భారీగా నగదు బంగారం అపహరించింది ఈ నేపాలి గ్యాంగ్. ఈ గ్యాంగ్ లోని వినోద్ సాహి, నార్జింగ్ సాహీ , సీతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుండి 5 లక్షల నగదు తో పాటు బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

రాయదుర్గం డీఎస్‌ఆర్‌ హిల్స్‌లో భారీగా నగదు చోరీ చేసిన ఈ గ్యాంగ్.. బోర్ వెల్ కాంట్రాక్టర్ గూడూరు మధుసూదన్ రెడ్డి ఇంట్లో 15 లక్షలు బంగారం, నగదు చోరీ చేసింది. వాచ్ మెన్, వంట మనిషులు గా ఇళ్లలో చేరి ఇంటికి కన్నం వేసిన నేపాల్ గ్యాంగ్.. మధుసూదన్ రెడ్డి భార్య కి ఆహారం లో మత్తు మంది ఇచ్చి దోపిడి చేసింది ఈ గ్యాంగ్. నేపాల్ గ్యాంగ్ ను బర్డర్ లో అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు… 12 గంటలకు మీడియా ముందుకు ప్రవేశ పెట్టనున్నారు.

Related posts