నెల్సన్ మండేలా జైలు జీవితం గడిపుతున్న సమయంలో వేసిన పెయింటింగ్ను ఈ మధ్యే న్యూయార్క్లో వేలం వేశారు. ఈ వేలంలో ఈ పెయింటింగ్ 78 లక్షల రూపాయలు (112,575 డాలర్లు) పలికింది. దీనిని ఆశకు శక్తివంతమైన గుర్తుగా అభివర్ణిస్తున్నారు. మండేలా 27ఏళ్ల పాటు కారాగారవాసం చేశారు. కారాగార సమయంలో మండేలా గీసిన 22 పెయింటింగ్లనూ వేలం వేయనున్నట్లు న్యూయార్క్లోని బోనామ్స్ వేలం హౌస్ తెలిపింది.
లిథోగ్రఫితో పునరుత్పత్తి చేసిన మండేలా వేసిన 10 పెయింటింగ్లను వర్ణ వివక్ష వ్యతిరేకతకు పోరాడే కార్యకర్తలకు సహాయంగా వినియోగిస్తున్నారు. ‘‘ఆయనకు పెయింటింగ్ వేయడం ఒక సాంత్వన. కానీ గతాన్ని అందులో మిలితం చేయడమూ ఆయనకే సాధ్యం’’ అని మండేలాపై ఆయన కూతురు ప్రశంసలు కురిపించారు. ఈ పెయింటింగ్లను ఆమెనే విక్రయిస్తున్నారు.