telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పులివెందుల పంచాయితీ చేస్తున్నారు: చంద్రబాబు

chandrababu

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. అమరావతిలో నెల్లూరు జిల్లా కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నెల్లూరు నేతలను పిలిచి పులివెందుల పంచాయితీ చేస్తున్నారని జగన్ పై బాబు మండిపడ్డారు.

కోటంరెడ్డికి వెంటనే బెయిల్ ఇచ్చి ప్రజలకు ఏం సందేశం స్తున్నారు? అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ప్రభుత్వం చేసే తప్పుడు పనులను ప్రజల్లో కి తీసుకెళ్లి ఎండగడతానని అన్నారు.

Related posts