అలనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా ఇటీవల పొట్టి గౌను వేసుకుని దిగిన ఫొటో ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది. ఆమె అందానికి నెటిజన్లు షాకయ్యారు. సినిమాల్లో బాగా రాణిస్తున్న సమయంలో ప్రముఖ మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్తో డేటింగ్ చేయడం, ఆ తర్వాత పెళ్లికి ముందే అతనితో ఓ బిడ్డకు కనడం జరిగిపోయాయి. కానీ కొన్ని కారణాల వల్ల వీవ్ రిచర్డ్స్ మాత్రం నీనాను పెళ్లి చేసుకోకుండా స్వస్థలానికి వెళ్లిపోయాడు. అప్పటినుంచి నీనా సమాజంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అందుకే కనీసం సోషల్ మీడియా ద్వారానైనా తానేంటో ప్రజలకు చూపించాలని అనుకుంటున్నానని తెలిపారు. 60 ఏళ్ల వయసులోనూ నీనా ఇన్స్టాగ్రామ్లో తనకు నచ్చిన ఫొటోలు పెడుతుంటారు. దీని గురించి నీనా మాట్లాడుతూ.. ‘నాకు ఇన్స్టాగ్రామ్ ఎలా వాడాలో తెలీదు. నా కూతురు మసాబా పీఆర్కి నేను ఏదన్నా ఫొటో పంపితే ఆమె సరిచేసి నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటుంది’ అని తెలిపారు.
“నేను నా ఇన్స్టాగ్రామ్లో నాకు సంబంధించిన చాలా ఫొటోలు పోస్ట్ చేస్తుంటాను. ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అని చాలా మంది నెటిజన్స్ తిట్టేవారు. అప్పుడు నాకు ఏమి అనిపించిందంటే.. ఇన్నేళ్లు నేనేంటో ప్రజలు తెలుసుకోలేకపోయారు. అందుకే ఈ రకంగానైనా అసలు నేను ఏంటి అనేది చూపించాలనుకుంటున్నాను. మీడియా నన్ను మీకు తప్పుగా చూపించింది. మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నేనేంటో ప్రజలు తెలియాలన్న ఫ్రస్ట్రేషన్ నాలో పెరిగిపోయింది. నా గురించి ఇప్పటివరకు మీడియా ఏవేవో రాసేసింది. దాంతో నీనా అంటే ఇది అని ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ పడిపోయింది. నేను యవ్వనంలో ఉన్నప్పుడు వీవ్ రిచర్డ్స్తో రోజూ సెక్స్ చేస్తూనే ఉంటాను అన్న ఇమేజ్ను కూడా క్రియేట్ చేసేశారు. అంతకుమించి అసలు నేనేంటి అన్నది ప్రజలకు తెలీదు. నాపై ఏర్పడ్డ తప్పుడు ఇమేజ్ వల్ల విసిగిపోయాను. మీరు ఇప్పటివరకు నా విషయంలో చూసింది నిజం కాదు. నేను ఇలా ఉంటాను అని ప్రజలకు ఎలా తెలియజేయాలో తెలిసేది కాదు. ఓసారి నాకు సినిమాల్లో అవకాశాలు కావాలని కోపంలో ఓ సారి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టానో ఆ రోజే నాకు తెలిసింది ఈ మాధ్యమాల ద్వారా నేనేంటో నిరూపించుకోగలను అని. కనీసం సోషల్ మీడియాలో నేను పెట్టే పోస్ట్లను నలుగురు చూసినా నాపై వారికి ఉన్న అభిప్రాయం మారుతుంది అనుకునేదాన్ని. అప్పటినుంచి నా అభిప్రాయాలను నిజాయతీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చాను. మీడియా నాపై క్రియేట్ చేసిన ఇమేజ్ను చెరిపేయాలని అనుకున్నాను” అని అన్నారు.