telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

తివారి కుమారుడు .. రోహిత్ శేఖర్ మృతి..

nd tivari son rohit sharma died

రోహిత్ శేఖర్ (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత ఎన్డీ తివారి కుమారుడు) మృతి చెందారు. రోహిత్ తన ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతున్న పరిస్థితుల్లో ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రికి ఆసుపత్రికి అంబులెన్స్ లో వెళ్లినట్టు సమాచారం. అంబులెన్స్ లో ఆసుపత్రికి చేరుకునే సమయానికి రోహిత్ మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

రోహిత్ శేఖర్ మృతిని వైద్యులు, ఢిల్లీ దక్షిణ డీసీపీ విజయ్ కుమార్ ధ్రువీకరించారు. రోహిత్ శేఖర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ రోహిత్ శేఖర్ నివాసం. ఈ సంఘటన జరిగిన సమయంలో అతని తల్లి ఇంట్లో లేనట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఎన్డీ తివారి తన తండ్రే అంటూ ఆరేళ్ల పాటు న్యాయస్థానంలో పోరాడి రోహిత్ శేఖర్ గెలిచాడు. దీంతో, అతను తన కొడుకేనని ఎన్డీ తివారి అంగీకరించారు.

Related posts