telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోదీ మళ్లీ ప్రధాని అయితే ఏం చేస్తారోనని భయం: శరద్ పవార్

Loksabha Elections MP Contest Sharad pawar

నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ఏం చేస్తారోనని భయంతో వణికిపోతున్నానని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా శనివారం దాంద్‌లో నిర్వహించిన సభలో పవర్ మాట్లాడుతూ తన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఎదిగానని మోదీ చెప్పారని, కానీ ఇప్పుడు అదే మోదీని చూస్తుంటే తనకు భయం వేస్తోందని అన్నారు.

మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఏమో, ఎవరికీ అర్థం కావడం లేదని పవర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మోదీ ఏడు సభల్లో ప్రసంగించారని, ప్రతి సభలోనూ తనపైనే విమర్శనాస్త్రాలు సంధించారని పవార్ పేర్కొన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో శరద్ పవార్ సీనియర్ మంత్రిగా ఉన్న రోజుల్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ప్రతి విషయంలో సహకరించేవారని 2016లో పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ గుర్తు చేసుకున్నారు. తనకు కితాబిచ్చిన మోదీని చూస్తుంటే ఇప్పుడు తనకు భయం వేస్తోందంటూ పవార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Related posts