telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి: శరద్ పవార్

Loksabha Elections MP Contest Sharad pawar

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని విషయం తెలిసిందే. శివసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించినా.. వారిద్దరి మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. 50-50 ఫార్ములా ప్రకారం సీఎం పదవిని చెరొ రెండేళ్లు పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుపడుతోంటే, బీజేపీ అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరోసారి పునరుద్ఘాటించారు.

మరో వైపు శివసేన ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు వెల్లువిరుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఫడ్నవీస్ నేతృత్వంలోనే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ రాష్ట్ర నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts