బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పదంగా మృతి చెంది ఇప్పటికే మూడు నెలలు గడుస్తున్నా సస్పెన్స్ గానే ఉంది. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు పూర్తిగా డ్రగ్స్ వైపు మళ్లింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుaల పేర్లు రావడం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ సీబీ అధికారులు మరికొందరికి సమన్లు పంపే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహాని రెండు రోజులపాటు విచారణ చేశారు. ఈ విచారణలో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. చివరిసారిగా సుశాంత్ ఓ సినిమా గురించి మాట్లాడాడని..ఆ సినిమాకు భారీ రెమ్యునరేషన్ అడిగానని తనతో చెప్పాడని జయా సాహా అధికారులకు వెల్లడించింది. చివరిగా కుమార్ మంగళ్ తెరకెక్కించనున్న ఓ సినిమా గురించి మాట్లాడడాన్ని, ఆ సినిమాకు ముందు 6 కోట్లకు ఒప్పందం కుదుర్చుకొని ఆతర్వాత 12 కోట్లు డిమాండ్ చేసాడని జయా సాహా అధికారులకు తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2016 నుంచి సుశాంత్ టాలెంట్ మేనేజర్గా పనిచేస్తున్న జయ ‘సన్చురియా’, ‘కేదార్నాథ్’, ‘చిచ్చోరే’, ‘డ్రైవ్’ సినిమాలు అతనికి వచ్చేలా చేసింది. ‘సన్చురియా’ చిత్రానికి రూ.5 కోట్లు తీసుకున్న సుశాంత్ ‘డ్రైవ్’కి రూ.2.25 కోట్లు, ‘కేదార్నాథ్’కి రూ.6 కోట్లు, ‘చిచ్చోరే’కి రూ.5 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది.
previous post
ఇళయరాజాపై నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు