ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో కేఎస్ రవికుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం “రూలర్”. రీసెంట్గా చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడదలయ్యేందుకు సిద్ధమైంది. కాగా బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో చిత్రం ప్రారంభమైంది. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో `సింహా`, `లెజెండ్` వంటి సూపర్హిట్ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శుక్రవారం) వీరి కాంబినేషన్లో మూడో చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా, `ద్వారాక` క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రం బోయపాటి తరహాలో హై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోదంట. `సింహా`, `లెజెండ్` మాదిరిగానే ఈ సినిమాలో కూడా బాలయ్య పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపింది. ఈ చిత్రంలో రోజా లేదా సంజయ్ దత్ విలన్గా నటిస్తారని తెలుస్తుంది. చిత్ర లాంచింగ్ సమయంలో బీ గోపాల్ ఫస్ట్ క్లాప్ కొట్టగా, అంబికా కృష్ణ స్విచ్చాన్ చేశారు. నువ్వొక మాటంటే అది శబ్దం… అదే మాట నేనంటే అది శాసనం అనే డైలాగ్ బాలయ్య చెప్పి అక్కడి వారందరిని ఆనందింపజేశారు.
#NBK106 begins with a formal pooja ceremony today. Glimpses from the launch…
Natasimha #NandamuriBalakrishna
Directed by #BoyapatiSrinu
Music by @MusicThaman
D.O.P #RamPrasad
Art by #ASPrakash
Produced by #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/XnVjuzcTND— BARaju (@baraju_SuperHit) 6 December 2019
#NBK106 launched with Powerful Dialogue
నువ్వొక మాటంటే అది శబ్దం …
అదే మాట నేనంటే అది శాసనం … #NandamuriBalakrishna #BoyapatiSrinu #MiryalaRavinderReddy@dwarakacreation pic.twitter.com/i2loKH6nAZ— BARaju (@baraju_SuperHit) 6 December 2019