telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాడే అసలైన మగాడు… ఎన్‌కౌంటర్‌పై స్పందించిన నయనతార

Nayanathara

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. కొంతమంది ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై సినీ తారలు దిశకు సరైన న్యాయం జరిగిందంటూ తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార స్పందించింది. దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఓ ప్రకటన విడుదల చేసింది నయనతార. “అన్యాయం జరిగిన వెంటనే న్యాయం జరిగితేనే అది సరైంది (Justice Is Good When Served Hot). సినిమాల్లో డైలాగ్‌లా అనిపించినా ఇప్పుడు ఇదే నిజమైంది. నిజమైన హీరోలు తెలంగాణ పోలీసులు ఈ రోజు తమ చర్యతో దాన్ని ప్రూవ్‌ చేశారు. నేను ఇదే మానవత్వాన్ని కాపాడే సరైన చట్టం అంటాను. దేశంలోని ప్రతీ మహిళ ఈ రోజును క్యాలెండర్‌లో నిజమైన న్యాయం జరిగిన రోజుగా గుర్తుంచుకోవాలి. మానవత్వం అంటే అందరిపై సమానంగా గౌరవించటం, ప్రేమించటం, దయ చూపించటం. ఇప్పుడు జరిగిన ఈ న్యాయానికి సంతోషపడటం కన్నా.. మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా మన ఇళ్లలోని మగ పిల్లల్ని.. ఈ ప్రపంచం మహిళలకు రక్షణ కల్పించిన వాడే అసలైన మగాడు అన్న విషయం తెలియజేయాలి” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నయనతార.

Nayanatara

 

Related posts