తెరాస పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టుగా తెలుస్తోంది.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నర నాయిని.. ప్రస్తుతం వైద్యానికి కూడా స్పందించడంలేదంటూ తెలుస్తోన్న సమాచారం ఆయన అభిమానులను, పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది… కాగా, సెప్టెంబర్ 28వ తేదీన నాయినికి కరోనా సోకింది.. ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కరోనా నెగిటివ్గా తేలడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి లేకపోవడంలో మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు.. ఆయకు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి చికిత్స కొనసాగుతుండగా.. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్రావు.. పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయను పరామర్శించారు.. అందుతోన్న వైద్యంపై ఆరా తీశారు.. కానీ, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని.. వైద్యానికి కూడా సహకరించడంలేదని సమాచారం.
previous post
next post