ఛత్తీస్గడ్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దంతెవాడ జిల్లాలోని కాటేకల్యాన్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ ఎన్ కౌంటర్ తో ఒక్కసారిగా పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ: శివరాజ్సింగ్