telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

నవోదయ విద్యాలయ.. ఉద్యోగ భర్తీ దరఖాస్తు ఆహ్వానం..

navodaya vidyalaya samiti recrutiment

నవోదయ విద్యాలయ సమితి(ఎన్.వి.ఎస్) లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీలలో ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), అసిస్టెంట్ కమీషనర్(అడ్మిన్), అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ వంటివి ఉన్నాయి. సంస్థ ప్రధాన మరియు ప్రాంతీయ కార్యాలయాలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మొత్తం ఖాళీలు 249. అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఎక్కువగా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయి. అక్కడ ఉద్యోగం వచ్చాక, స్థానిక సంస్థకు బదిలీ చేయడం కుదరదని నోటిఫికేషన్ లో స్పష్టంగా చెప్పారు, దీనిని అభ్యర్థులు గమనించగలరు.

మొత్తం ఖాళీలు : 249
ప్రిన్సిపాల్ – 25; అసిస్టెంట్ కమీషనర్(అడ్మిన్) గ్రూప్ ఏ – 3; అసిస్టెంట్ గ్రూప్ సి – 3; పీజీటీ -218.

దరఖాస్తు చేసుకొనే విధానం :
1. అధికారిక వెబ్ సైట్ navodaya.gov.in లో కి వెళ్ళాలి.
2. పై వెబ్ సైట్ లో ‘స్టూడెంట్ కార్నర్’ లో కి వెళ్లి ‘అడ్మిషన్’ ను క్లిక్ చేయాలి.
3. అనంతరం ‘యాడ్స్ / వేకెన్సీస్’ లోకి వెళ్లి, అందులో ‘రిక్రూట్మెంట్’ లో కి వెళ్ళాలి.
4. అనంతరం ‘అప్లికేషన్’ లింక్ పై క్లిక్ చేయాలి.
5. అప్లికేషన్ పూర్తిగా(వెబ్ సైట్ లో అప్లికేషన్ లింక్ త్వరలో యాక్టీవ్ అవుతుంది) నింపి, సరిచూసుకుని, సుడ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.

Related posts