telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఘనంగా ప్రారంభమైన .. శరన్నవరాత్రి ఉత్సవాలు…

navaratri utsav started today

విజయవాడ : ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్వనమివ్వనున్నారు. తొలిరోజైన నేడు అమ్మవారు స్వర్ణకవాచాలంకృత దుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 5700 మంది పోలీసులు, 1200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 350 మంది సెక్యూరిటీ సిబ్బంది, 900 మంది వాలంటీర్లు విధుల్లో ఉన్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం (అక్టోబర్ 5న) ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

శ్రీశైలం : నేటి నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తెలంగాణలోని వరంగల్‌ శ్రీభద్రకాళి ఆలయంలోనూ కలశస్థాపన, జ్యోతిప్రకాశనంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఇక్కడ 9 రోజుల పాటు అమ్మవారికి ఆరాధన ప్రత్యేక అలకంరణ, పూజలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం విశేష అభిషేక పూజ, ఘటస్థాపనతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం నుంచే అన్ని ఆలయాలల్లోనూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.

బాసర ఆలయం : సరస్వతీ, మహాలక్ష్మీ, మహంకాళి అమ్మవార్లు ఉత్సవాలకు కొలువుదీరారు. ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు కొనసాగనున్నాయి. తొమ్మిది రోజులు రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముస్తాబైన ఇంద్రకీలాద్రి… అమరావతి: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వేడుకగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపు రూ.7 కోట్లతో ఏర్పాట్లు చేసింది. ఏటా ఆశ్వయుజ మాసంలో జరిగే నవరాత్రి వేడుకలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవితో మొదలై అక్టోబర్ 8వ తేదీ వరకు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 గంటలకు స్నపనాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రెండోరోజు నుంచి తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది.

Related posts