telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ పరిశ్రమలో మరో విషాదం..

సినీ పరిశ్రమను విషాదాలు వీడడం లేదు. ఈ ఏడాది సినీ పరిశ్రమను అస్సలు అచ్చిరానట్టుంది. ఇప్పటికే కరోనా కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. అటు సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటులు ఈ ఏడాదిలో మృతి చెందగా… తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత పి. కృష్ణమూర్తి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయసు 77 ఏళ్లు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబంతో సహా చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చాలా మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని… ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని పేర్కొంటున్నారు.

Related posts