లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు మొదలైనప్పటికీ, దాదాపు రెండు నెలలు షూటింగ్లు నిలిచిపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం ఏర్పడింది. దీంతో నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ పారితోషకాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. తాజాగా సీనియర్ నటుడు నాజర్, ఆయన సతీమణి కమీల నాజర్ కూడా పారితోషకం 15 శాతం తగ్గించుకున్నారు. ఈ విషయాన్ని ‘కపటధారి’ నిర్మాత ధనంజయన్ వెల్లడిస్తూ, ‘కపటధారి’ చిత్రానికి సంబంధించిన పారితోషికం తీసుకుంటూ కూడా నాజర్ దంపతులు ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకుని మరో 15 శాతం తగ్గించుకునేందుకు ముందుకొచ్చారని, నిర్మాతకు మంచి జరగాలన్న వారి పెద్ద మనసుని ప్రశంసించకుండా ఉండలేమని అన్నారు.
previous post
next post