telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ఎంపీ ఇంటిపై దుండగుల దాడి!

గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో నరసరావుపేటలోని ఆయన నివాసం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాడి చేసిన అనంతరం వెంటనే ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా దుండగులు వాచ్ మెన్ ను బెదిరించి పరారయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఎంపీ ఇంటికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దుండగులకు సంబంధించిన వివరాలను వాచ్ మెన్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.

Related posts