telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ ట్వీట్ వైరల్..సెకనుకో కామెంట్

narendra-modi

సోషల్ మీడియా ఖాతాల్లో కోట్ల మంది ఫాలోవర్లను కలిగివున్న ప్రధాని నరేంద్ర మోదీ, తాను ఈ ఖాతాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని నిన్న చేసిన ట్వీట్ వైరల్ అయింది. ప్రధాని చేసిన ట్వీట్ గంట వ్యవధిలోనే 26 వేలకు పైగా రీ ట్వీట్ అయింది. క్షణానికో కామెంట్ వచ్చింది.మోదీ నుంచి నిరంతర అప్ డేట్స్ కొనసాగాలని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అత్యధికులు కోరడం గమనార్హం.

మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి, మోదీ వదిలేస్తే తామూ సోషల్ మీడియాను వదిలేస్తామని స్పష్టం చేశారు. ఇక ‘నో సార్’ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ చాలా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో 5.33 కోట్లమంది, ఫేస్‌ బుక్‌ లో 4.4 కోట్ల మంది, ఇన్‌ స్ట్రాగామ్‌ లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు.

Related posts