ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలని భావిస్తుండడంపై జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. వదిలేయాల్సింది సోషల్ మీడియాను కాదని, విద్వేషాన్ని వదిలేయాలని రాహుల్ హితవు పలికారు.
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. మన ప్రధాని అకౌంట్ ను ఎవరూ హ్యాక్ చేయలేదు కదా! అంటూ చమత్కరించారు.