మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు నెల రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. పార్టీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారు. నేడు ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టాలని లోక్సభ సభ్యులకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించి.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 వరకూ కొనసాగించాలని పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రహ్లాద్ జోషీ లోక్సభ సభ్యులకు సూచించారు. పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రరభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.