telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రైలు ప్రమాద ఘటన గురించి తెలుసుకుని కలత చెందాను: మోదీ

ఈ రోజు తెల్లవారు జామున మహారాష్ట్రలోని ఔరంగాబాద్ చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రమాదంలో మంది వలస కార్మికులు మృతిచెందడంపై తీవ్ర వేదనకు గురైనట్లు తెలిపారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. అక్కడ పరిస్థితులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయ చర్యలు కొనసాగుతున్నాయని మోదీ ట్వీట్ చేశారు.

ప్రమాదంలో గాయపడిన వారికి ఔరంగాబాద్‌ సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రైలు పట్టాలపై కూలీలు ఉన్న విషయాన్ని గుర్తించిన లోకో పైలట్ రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

Related posts