telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రపంచ దేశాలు మన వైపే చూస్తున్నాయి: ప్రధాని మోదీ

modi speech on J & K

‘పత్రిక గ్రూప్’ ఛైర్మన్ గులాబీ కొఠారీ రాసిన రెండు పుస్తకాలను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు మనవైపే చూస్తున్నాయని అన్నారు. మనం చెప్పే మాటను వింటాయని మోదీ పేర్కొన్నారు.

భారతీయ సమాచారాన్ని శ్రద్ధగా తెలుసుకుంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ గ్లోబల్ మీడియాగా ఎదగాలని చెప్పారు.భారత మీడియా ఖండాంతరాలను దాటి వెళ్లాలని పిలుపునిచ్చారు. యువత పుస్తకాలు ఎక్కువగా చదవాలని సూచించారు. సోషల్ మీడియా పాప్యులర్ అవుతున్న ఈరోజుల్లో యువత విజ్ఞానాన్ని పెంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.

Related posts