telugu navyamedia
రాజకీయ వార్తలు

రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం!

modi speech on J & K

ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా కట్టడి చర్యలపై ఆయన ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను పొడిగించాలా? లేక నిబంధనలు సడలించాలా? అన్న అంశాలపై ఆయన నిన్న ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. దాదాపు ఆరు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో మోదీకి సీఎంలు కీలక సూచనలు చేశారు.

తొలి దశ లాక్‌డౌన్‌లో తీసుకున్న పలు చర్యలు రెండో దశలో తీసుకునే అవసరం లేదని, అలాగే, రెండో దశలో తీసుకున్న పలు చర్యలను మూడో దశలో తీసుకోలేదని మోదీ నిన్న సీఎంలతో అన్నారు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో తీసుకునే అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు. దీంతో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts