దేశంలో ఇప్పటికి కరోనా సోకిన వారి సంఖ్య 129కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై బీజేపీ నేతలు చర్చిస్తున్నారు.
ఈ సందర్భంగా కరోనా వైరస్ ప్రభావంపై కూడా పలువురు నేతలు మాట్లాడారు. ఈ విషయంపై మోదీ మాట్లాడుతూ ఎంపీలకు పలు సూచనలు చేశారు. ప్రతి బీజేపీ ఎంపీ తమ నియోజక వర్గాల్లో పర్యటించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.