telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యం: మోదీ

Modi bjp

ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో రామమందిరం భూమిపూజ అనంతరం ఆయన మాట్లాడుతూ అయోధ్య భూమిపూజలో పాలుపంచుకోవడం తన అదృష్టమని మోదీ అన్నారు. మందిర నిర్మాణంతో అయోధ్య రూపు రేఖలు మారిపోతాయన్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారని, దాంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

మానవుడు రాముడిని విశ్వసించినప్పుడల్లా పురోగతి జరిగిందని మనం గుర్తుంచుకోవాలన్నారు. ఆ మార్గం నుంచి తప్పుకున్నప్పుడల్లా.. విధ్వంసం తలుపులు తెరవబడ్డాయని పేర్కొన్నారు.

మనం అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని మోదీ కోరారు. మన దేశంలో పలు భాషల్లో రామాయణాన్ని రచించారని తెలిపారు. రాముడు అనేది ఒక సత్యమని, మనందరిలో రాముడు ఉన్నాడని చెప్పారు.

మన పొరుగునున్న దేశాల సంస్కృతిలో కూడా రాముడు ఉన్నాడని చెప్పారు. బుద్ధుడి బోధనల్లో, గాంధీ ఉద్యమాల్లో రాముడు ఉన్నాడని తెలిపారు. కబీర్, గురునానక్ వంటి వారికి రాముడు స్ఫూర్తి అని అన్నారు. మనం ఎలా బతకాలనే విషయాన్ని రాముడి జీవితం మనకు బోధిస్తుందని చెప్పారు.

Related posts