ఇంటర్ విద్యలో అత్యధిక శాఖలు గల విద్యాసంస్థలు నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ రెండు కాలేజీలపై విచారణ జరపాలని ఆదేశించింది.ఈ రెండు కాలేజీలు పలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ రాజేష్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు… ఈ కాలేజీలపై పూర్థి స్థాయలో విచారణ జరపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదికను తమకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
భారత ఈవీఎంల పనితీరు బాగుంది : ఆస్ట్రేలియ రాయబారి