telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లోకేశ్ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఫైర్

Vamsi

టీడీపీ నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. సంతలో గొర్రెలను కొన్నట్టు టీడీపీ నేతలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, పోతుల సునీతలను వైసీపీ కొనేసిందని లోకేశ్ కామెంట్ చేశారు. వీరి ఫొటోలతో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కూడా కొన్నారని వ్యాఖ్యానించారు.

లోకేశ్ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. వద్దని చెప్పినా వినకుండా వెళ్లి మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారని నారా లోకేశ్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇప్పుడు శాసనమండలి కూడా రద్దు కావడంతో ఆయనకు పిచ్చి పట్టిందని దుయ్యబట్టారు. అందుకే పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నారని అన్నారు. గొర్రెలకే కాదు పిచ్చికుక్కలకు కూడా తన వద్ద వైద్యముందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related posts