తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రారంభం కాగానే దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది. దీంతో టిడిపి.. నిరసనకు దిగింది. అంతేకాదు టిడిపి అధినేత చంద్రబాబు.. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దానిపై పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో తిరుపతి ఎన్నికల్లో భాగంగా పెద్దిరెడ్డి పై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. పెద్దిరెడ్డి ఒక వీరప్పన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. “పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి..ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే! ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి బయటి నుంచి తన ముఠాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు. పెద్దిరెడ్డి మనుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పిఎల్ఆర్ కళ్యాణమండపంలో మకాం వేసి దొంగ ఓట్లు వేయడానికి వెళ్తుంటే టిడిపి నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరిగిన పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పోలీసులు, అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎలక్షన్ జరగకుండా సెలక్షన్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి..కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న తిరుపతి ఎన్నికను అక్రమార్గంలో గెలవాలని నేరుగా తానే రంగంలోకి దిగారు. తిరుపతి ఉపఎన్నికలో రిగ్గింగ్, దొంగ ఓట్లతో నెగ్గాలని వేసిన ప్రణాళికని తెలుగుదేశం బట్టబయలు చేసింది. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల తరలివచ్చిన వేలాది మందిని అరెస్ట్ చేసి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి.” అంటూ లోకేష్ పేర్కొన్నారు.
previous post
next post
కాపుల అన్యాయాలపై పవన్ ప్రశ్నించలేదు: ఎమ్మెల్యే జక్కంపూడి