telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం జగన్‌పై లోకేష్‌ సెటైర్‌… “జగనన్న జైలు పిలుస్తోంది పథకం” అంటూ

Lokesh Tdp

ఏపీలో ఇవాళ జగన్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్‌ తనదైన స్టైల్‌లో కామెంట్‌ చేశారు. ” పేదలకది సెంటు స్థలం, సీఎం జగన్‌ కి, వైకాపా ఎమ్మెల్యేలకు అది కుంభ స్థలం.స్థల సేకరణ లో అవినీతి, చదును పేరుతో దోపిడీ,పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చడం.మొత్తంగా పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ 6,500 కోట్లు. టిడిపి హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రానా సైకిల్ బ్రాండ్ చేరిగిపోదు. నీ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు,గుట్టలు,శ్మశానాల్లో,చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఆధారాలతో జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డి తో పాటు చిప్పకూడు తినడం ఖాయం.ఇప్పటి వరకూ టిడిపి కేసుల వలనే స్థలం ఇవ్వలేక పోతున్నాం అన్నావ్.మరి ఇప్పుడెలా ఇస్తున్నావ్ జగన్ రెడ్డి, అందుకే నిన్ను ఫేక్ సిఎం అనేది.” అంటూ నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు.

Related posts