telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి: లోకేష్

Nara Lokesh

ఏపీ : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గంలోని దోసకాయలపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కావాలనే ఈ దాడి జరిగి ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. అయితే.. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్‌ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి అని మండిపడ్డారు. విగ్రహల ధ్వంసం వెనుక వైసీపీ గ్యాంగ్‌ ఉందని ఆరోపణలు చేశారు లోకేష్‌. “మూర్ఖత్వానికి మానవ రూపం సీఎం జగన్‌. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ జగన్ రెడ్డి మరింత దిగజారిపోయాడు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాల పై పడింది. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిది విగ్రహం పడగొడితే చెరిగిపోయే చరిత్ర కాదు. తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ని కఠినంగా శిక్షించాలి. ” అంటూ లోకేష్‌ ఫైర్‌ అయ్యారు.

Related posts