టీడీపీ కార్యకర్తలను ఆదుకునేందుకు ప్రతీ జిల్లాకు లీగల్ సెల్ ఏర్పాటు చేశామని ఆ పార్టీ నేత నారా లోకేశ్ తెలిపారు. కార్యకర్తలకు మద్దతుదారులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని లోకేశ్ అన్నారు. వైసీపీ నేతలు బెదిరించినా, దాడిచేసినా టీడీపీ ప్రత్యేక విభాగం నంబర్ 7306299999కు సమాచారం అందించాలని సూచించారు. ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు, అభిమానులను రక్షించుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఫిర్యాదు చేసేందుకు https://www.facebook.com/tdpsocialmedialegalcell
అనే ఫేస్ బుక్ పేజీని ప్రారంభించామని తెలిపారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు కార్యకర్తల దృష్టికి వస్తే, ఈ పేజీ వేదికగా పంచుకోవాలని కోరారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.