telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పేదల భూములు ఎందుకు లాక్కుంటున్నారు?: నారా లోకేశ్

Minister Lokesh comments YS Jagan

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న భూసేకరణ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ ఘాటుగా స్పందించారు. పథకాల పేరు మార్పు కోసం పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు.

పేదవాళ్లకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కుని తిరిగి పేదలకు పంచుతాననడం జగన్ రివర్స్ టెండరింగ్ కు పరాకాష్ట అని విమర్శించారు. వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్లు ప్రభుత్వానికి ఇవ్వండి… లక్షల మంది పేదలకు ఇళ్లు వస్తాయని దుయ్యబట్టారు.

Related posts