ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పై అదనంగా రూ.5 వసూలు చేస్తూ ప్రజలపై వేసిన భారం ఏడాదికి రూ.2,500 అని వివరించారు. పీల్చే గాలిపై కూడా జగన్ పన్ను విధించడం ఖాయం అని లోకేశ్ ట్విట్టర్ లో విమర్శించారు.
కుడిచేత్తో రూపాయి ఇచ్చి ఎడమచేత్తో రూ.10 కొట్టేయడమే జగన్ గారి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మహత్యం అంటూ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేసింది లేదని అన్నారు. కనీసం గుంతలు కూడా పూడ్చని వైసీపీ ప్రభుత్వం రోడ్డు అభివృద్ధి పన్ను విధించడం ఘోరం అని విమర్శించారు.
చంద్రబాబుకు పట్టం కట్టేందుకే మహిళలు: బొండా ఉమ