telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిలువెత్తు రూపం మావయ్య.. హరికృష్ణకు లోకేష్ నివాళి

టీడీపీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష నివాళులర్పించారు . చెరగని చిరునవ్వు, భోళాతనం, చిన్నాపెద్దా అందరికీ ఆత్మీయతను పంచే మంచితనం వీటన్నిటికీ నిలువెత్తు రూపం మావయ్య హరికృష్ణ అంటూ చెప్పుకొచ్చారు. హరికృష్ణ మారణించి ఏడాది గడిచినా ఆయన లేరనే విషయం నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిద్దామంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

2018 ఆగష్టు 29న నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తన సన్నిహితుడి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న హరికృష్ణ కారు నల్గొండలో అదుపుతప్పడంతో ఆ ప్రమాదంలో అక్కడికక్కడే ఆయన దుర్మరణం చెందారు.

Related posts