telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సాక్షి మీడియా కథనం పై లోకేశ్ ఫైర్

Minister Lokesh comments YS Jagan

సాక్షి మీడియాలో వస్తున్న కథనాల పై మాజీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఏపీలో టీడీపీ ఓటమికి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలే బాధ్యులని తాను వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తలను లోకేశ్ ఖండించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని సాక్షి ఛానెల్ లో చేస్తున్న విషప్రచారానికి ఆధారాలు చూపించాలని ట్విటర్ లో సవాల్ విసిరారు.

ఇకనైనా, తమ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అబద్ధాల సాక్షి ఇంకా తన బుద్ధి మార్చుకోలేదని దుయ్యబట్టారు. మీడియా విలువలు లేవనడానికి ఆ ఛానెల్ తనపై ఇస్తున్న బ్రేకింగ్ న్యూసే నిదర్శనమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Related posts